నూకాలమ్మ మొక్కు తీర్చుకున్న పవన్ కల్యాణ్

నూకాలమ్మ మొక్కు తీర్చుకున్న పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బంపర్ మెజారిటీతో గెలుపొందింది.. 12న కొత్త ప్రభుత్వం కొలువుతీరనుంది.. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పవన్ కల్యాణ్ కూడా మంత్రిగా ప్రమాణం చేస్తారని ప్రచారం జరుగుతోంది.. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ ఎలాంటి హాడావుడి లేకుండా.. సైలెంట్ గా అనకాపల్లిలో పర్యటించి నూకాలమ్మ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.