భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీకి మరో షాక్ తగిలింది.. తాజాగా మరో ఎమ్మెల్యే గులాబీ పార్టీకి గుడ్బై చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు దిగి చెయ్యి అందుకున్నారు. సోమవారం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గూడెం మహిపాల్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.