విషాదాన్ని నింపిన సెలవు దినం.. 12 ఏళ్ల లోపు చిన్నారులు బలి..

విషాదాన్ని నింపిన సెలవు దినం.. 12 ఏళ్ల లోపు చిన్నారులు బలి.. ఆదివారం సెలవు వరంగల్ ఉమ్మడి జిల్లాలో మూడు కుటుంబాల్లో ఊహించని విషాదాన్ని నింపింది. నలుగురు చిన్నారులు జలసమాదయ్యారు. సరదాగా ఈతకు వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. మృతుల కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాలో నిన్న ఒక్కరోజే రెండు వేరువేరు ఘటనల్లో నలుగురు చిన్నారులు మృతి చెందారు. తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామానికి చెందిన నలుగురు చిన్నారులు గ్రామ శివారులోని మడుగులో ఈతకు వెళ్లారు. వీరిలో యాకూబ్(12), జంపన్న(10) అనే ఇద్దరు చిన్నారులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు ప్రాణాలతో బయట పడ్డారు.