చేపల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా.. అసలే మృగశిర కార్తె.. ఇగ చూస్కో

చేపల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా.. అసలే మృగశిర కార్తె.. ఇగ చూస్కో విజయవాడ- హైదరాబాద్ హైవేపై ప్రమాదం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట వద్ద క్యాట్ ఫిష్ లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో రోడ్డు పక్కన చేపలన్ని చెల్లాచెదరుగా పడిపోయాయి. దీంతో చేపల కోసం జనం ఎగబడ్డారు. దొరికిన చేపలను పట్టుకుని తీసుకెళ్లారు స్థానికులు.