3 గంటలపాటు ప్రయాణికుల నరకయాతన.. సప్పర్ల ఘాట్‌లో మొరాయించిన ఆర్టీసీ బస్సు..

అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో కండిషన్ లేని బస్సులనునడుపుతుండడంతో నిత్యం ఘాట్ రోడ్లో బస్సులు ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తాజాగా మరోసారి ఆర్టీసీ బస్సు అడవిలో ఆగిపోయింది. దీంతో 3 గంటలపాటు ప్రయాణికులు నరకయాతన అనుభవించారు.