ఆమ్ఆద్మీ ఎంపీ స్వాతి మలివాల్ ఎపిసోడ్లో ఢిల్లీ పోలీసులు దూకుడు పెంచారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో.. సీఎం కేజ్రీవాల్ పర్సనల్ సెక్యూరిటీ బిభవ్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. బిభవ్ కుమార్ తనపై దాడి చేశాడని స్వాతి మలివాల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అయన్ను అరెస్ట్ చేశారు.