రైతులకు కోతుల బెడద తప్పడం లేదు. వనంలో ఉండాల్సిన వానరాలు జనావాసాలు, పంట పొలాల మధ్య తిరుగుతూ, రైతులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. పంట పొలాలను ధ్వంసం చేస్తూ రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అయితే ఓ రైతు తన మొక్కజొన్న పంటను కాపాడుకోవడానికి వినూత్న రీతిలో ఆలోచించాడు. కొండ ముచ్చుల ప్లెక్సీలను ఏర్పాటు చేసి, తన పంటను కాపాడుకుంటున్నాడు.