అమానుషం..! 3రోజులుగా ఆస్తి కోసం ఆగిన అంత్యక్రియలు

మారుతున్న కాలం తోపాటు మానవ సంబంధాలన్ని ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నాయి. మనిషి అంతిమ సంస్కారాలకు కూడా ఆస్తి గోడవలే అడ్డుగోడలుగా మారుతున్నాయి. ఆస్తులు, కేసులతో చివరికి రక్త సంబంధాలు కూడా చిద్రమవుతున్నాయి. తండ్రి ఆస్తి కోసం కోర్టుకెక్కిన ఇద్దరు చెల్లెళ్లు, ఆ కేసును ఉపసంహరించుకుంటేనే అంత్యక్రియలు నిర్వహిస్తామని భార్య భీష్మించుకుంది. దీంతో మూడు రోజులుగా మృతదేహం మార్చురీలోనే మగ్గుతోంది.