హైదరాబాద్లో పలువురు నేరస్థులు పార్క్ను క్లీన్ చేశారు.. చెత్తను ఊడ్చి.. ఎత్తి పోశారు.. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడ కృష్ణ కాంత్ పార్క్ (Krishna Kanth Park) లో చోటు చేసుకుంది. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్నపాటి గొడవలు, ప్రజా శాంతిభద్రతకు భంగం కలిగించే చర్యలు, అసాంఘిక ప్రవర్తన.. తదితర కేసుల్లో నిందితులుగా ఉన్న 35 మందిపై పోలీసులు పిట్టీ కేసులు నమోదు చేశారు. వీరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.