కాంగ్రెస్లో డజను మంది సీఎం అభ్యర్థులున్నారని కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ కు వచ్చేది 20 సీట్లేనని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ అద్భుతమైన విజయం సాధించబోతోందన్నారు. గతం కంటే రెండు సీట్లు ఎక్కువే వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాత్రం మొదటికే మోసం వస్తుందని కేసీఆర్ హెచ్చరించారు.