రెండు రోజు జగన్ బస్సుయాత్ర.. అన్ని వర్గాలు బ్రహ్మరథం

ఏపీ సీఎం జగన్ రెండో రోజు యాత్రలో ఎర్రగుంట్ల గ్రామానికి చేరుకుని అక్కడి ప్రజలతో సమావేశం అయ్యారు. సంక్షేమ పథకాలపై.. ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ఒక్క ఎర్రగుంట్లకు.. 58 నెలల్లో తామేం చేశామన్నది.. లెక్కలతో సహా వివరించారు సీఎం జగన్. ఎర్రగుంట్లలో 93శాతం ప్రజలకు పార్టీలు చూడకుండా సంక్షేమం అందించామన్నారు. మొత్తం 1391 మంది ఇళ్లకు చెందిన లబ్దిదారులకు.. వివిధ పథకాల ద్వారా 48 కోట్ల.. 74లక్షల 34వేల 136 రూపాయలు అందించామన్నారు సీఎం జగన్. అవినీతికి తావులేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేశామన్నారు సీఎం.