ఇదో నయా ట్రెండ్.. నమ్మించి నట్టేట ముంచుతున్న ముఠా!

ఫైనాన్స్ కోసం వారి ఐడీ రుజువులను తీసుకుంటారు. వారికి తెలియకుండానే వెహికల్స్ తీసుకుంటారు. గుట్టుచప్పుడు కాకుండా ఆమ్మే జల్సాలు చేస్తారు. ఇలా ఈవి వాహనాలు కాజేసిన ముగ్గురు వ్యక్తులను పోలీసలు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.44.80 లక్షలు విలువ చేసే 27 టీవీఎస్ ఖ్యూబ్, సుజుకి Burgman వాహనాలను ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరొకరి కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.