తెల్లనిపువ్వులతో ఏడుపాయల వన దుర్గకు అలంకరణ..

మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం అయిన ఏడుపాయల వనదుర్గభవాని అమ్మవారు ధవళవర్ణంతో దర్శనం ఇచ్చారు. అమ్మవారిని ఆలయ అర్చకులు మల్లెపూలు, సన్నజాజులు, లిల్లిలతో విశేషమైన అలంకరణ చేశారు. ఆ తెల్లన్ని పూల అలంకరణలో చల్లని చూపులతో దర్శనం ఇస్తున్న అమ్మవారిని అలా చూస్తూ ఉండిపోవాల్సిదే ఎవరైనా... నేడు మంగళవారం కావడంతో తెల్లవారుజామున అమ్మవారికి అభిషేకం, సహస్రనామార్చన, ప్రత్యేక పూజలు చేశారు.