అడిగినంత డబ్బు ఇవ్వలేదనీ.. కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్‌లో డబ్బు ఇవ్వలేదని కన్న తల్లిపై ఓ యువకుడు దాడి చేసి కొట్టి చంపిన దారుణ ఘటన చోటుచేసుకుంది. కొడుకు చేతిలో దెబ్బలు తిన్న ఆ తల్లి మృతి చెందింది. తల్లిని చీరతో గొంతు చుట్టూ బిగించి చంపుతున్న వీడియో బయటికి రావడంతో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లాలో షాద్‌నగర్‌లోని కేశంపేట్ రోడ్‌లో నివాసముండే సుగుణమ్మపై ఆమె కుమారుడు ఆదివారం విచక్షణా రహితంగా దాడి చేశాడు. దాడి చేసే సమయంలో సుగుణ ధరించిన చీరను ఆమె కొడుకు మెడకు బిగించి బలంగా లాగాడు. స్థానికులు అడ్డుకొని కొడుకును పంపించి వేశారు. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.