ఘనంగా నవరాత్రి ఉత్సవాలు.. కరెన్సీ నోట్లతో దుర్గాదేవికి అలంకరణ..

దేశ వ్యాప్తంగా దేవి శరన్నవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి. దుర్గామాత రోజుకో అవతారంలో దర్శనం ఇస్తుండడంతో దానికి అనుగుణంగా భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. తొమ్మిది రోజుల పాటు ప్రతీ రోజు వివిధ రూపాల్లో అమ్మవారిని అలంకరిస్తూ తమ భక్తిని చాటి కుంటున్నారు. కొందరు కరెన్సీ నోట్లతో దుర్గాదేవిని అలంకరిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అమ్మవారికి 45 లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో మండపాన్ని అలంకరించారు