స్మశాన వాటికకు దారేది.. అంత్యక్రియలు జరపాలంటే ఆ ఊళ్లో తిప్పలే..

అంత్యక్రియలు జరపాలంటే ఆ ఊళ్లో ముప్పుతిప్పలే. పొలాల్లో పంటలు వేస్తే.. గట్లపై.. లేదంటే పొలాల్లోనుంచి మృతదేహాన్ని మోసుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ దారుణ పరిస్థితి కనిపించింది. ఐ.పోలవరం మండలం జి.మూలపొలం పంచాయితీ పరిధిలోని ఎర్రగరువు గ్రామంలో శ్మశానవాటికకు వెళ్లేందుకు దారి లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు స్థానికులు.