వంట పనికోసం వచ్చారు.. ఇంతలోనే!

అన్నమయ్య జిల్లా పీలేరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాలంవారిపల్లి సమీపంలో అదుపు తప్పిన కారు రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ బావిలోకి దూసుకెళ్ళింది. కారులో ప్రయాణిస్తున్న 5 మందిలో ముగ్గురు మృతి చెందారు. ప్రాణాలతో మరో ఇద్దరు బయట పడ్డారు. ఆదివారం(మే 18) తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొనివచ్చిన కారు అదుపు తప్పి బావిలోకి బోల్తా పడ్డట్లు స్థానికులు తెలిపారు.