తిరుమలకు వెళ్లే భక్తులకు అలెర్ట్.. సర్వదర్శనానికి 20 గంటలు..

స్వామి వారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్ లో కుర్చుని ఎదురుచూస్తున్నారు. అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులతో నిండిపోవడంతో క్యూలైన్లు ఏకంగా క్యూలైన్‌ కృష్ణతేజ గెస్ట్‌హౌస్ మీదుగా రింగురోడ్డులో శిలాతోరణం వరకూ భక్తులు బారులు తీరారు. క్యూలైన్లలో ఉన్న భక్తులు ఎటువంటి ఇబ్బంది  పడకుండా ఆహారం, తాగునీరు, పాలను అందిస్తున్నారు. మరోవైపు తిరుమలలో వసతి గృహాలు దొరకక భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.