భోజనంలో బాగా వేయించిన విషపు జెర్రి.. తిరుపతిలో ఓ హోటల్‌ నిర్వాకం

తిరుపతిలో హోటల్‌లో భోజనం చేసేందుకు వచ్చిన ఓ యువకుడికి చేదు అనుభవం ఎదురైంది. హోటల్ సిబ్బంది వడ్డించిన భోజనంలో ఓ వింత ఆకారం కనిపించింది. నిశితంగా పరిశీలించగా బాగా రోస్ట్‌ అయిన విషపు కీటకంగా గుర్తించాడు. దీంతో ఇదేంటని ప్రశ్నించిన అతనిపై హోటల్‌ సిబ్బంది దాడికి దిగారు. ఒళ్లు మండిన సదరు యువకుడు ఫొటోలు వీడియోలు తీసి.. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఈ విషయం కాస్త చిరిగి చిరిగి గాలివానగా మారింది.