నేను సేప్ గానే ఉన్నా..

తాను క్షేమంగానే ఉన్నానని కార్యకర్తలు, ఆత్మీయులు , అభిమానులు‌ ఎవరు ఆందోళన చెంద వద్దని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వీడియో విడుదల చేశారు. హైదరబాద్ నుండి ఆదిలాబాద్ వస్తుండగా నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి వద్ద ఎమ్మెల్యే వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే పీఏకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం నుండి ఎమ్మెల్యే క్షేమంగా బయటపడ్డారు.