ఆకాశం నుంచి వందల మంది ప్యారా చుట్ సాయంతో కిందకు దూకేశారు. అటు ఇటు జోరుగా విమానాలు వస్తున్నాయి.. విమానాల నుంచి పారా ట్రూపర్స్ అలా గాలిలో నుంచి కిందకు దిగుతున్నారు. దాదాపు రెండు వందల ఎనభై మంది సైనికులు ఒకేసారి విమానాల నుంచి కిందకు దూకారు. ఈ హఠాత్తు పరిణామంతో స్థానికలుు యుద్ధం ఏమైనా జరుగుతుందా అనుకున్నారు. తర్వాత అసలు విషయం తెలుసుకుని ఉపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్-కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో జరిగింది.