కాసేపట్లో ప్రారంభం కానున్న ఖైరతాబాద్ గణేశుని శోభాయాత్ర .. మహాగణపతికి కాసుల వర్షం

వినాయకచవితి నుంచి  పది రోజుల పాటు భక్తుల నీరాజనాలందుకున్న ఖైరతాబాద్ గణనాథుడు మరికాసేపట్లో గంగమ్మ ఒడికి చేరనున్నాడు. ఇప్పటికే క్రేన్ సహాయంతో టస్కర్ వాహనంపై ఎక్కించారు.  వాహనం ఎక్కించిన అనంతరం భారీ విగ్రహం కదలకుండా వెల్డింగ్ పనులు చేపట్టారు. ఈ వెల్డింగ్ పనులు పూర్తయిన తర్వాత పూజ కార్యక్రమం నిర్వహించనున్నారు గణపతికి.  అనంతరం గణేశుడి శోభయాత్ర ప్రారంభం కానుంది.