గుడి తలుపులు తెరిచి పూజారి షాక్..!

దొంగలు దేవుళ్లను కూడా వదిలిపెట్టడంలేదు. అందుకు నిదర్శనమే ఇటీవల ఆలయాల్లో వరసగా జరుగుతున్న చోరీలు. తాజాగా కర్నూలు జిల్లాలోని ఓ ఆలయంలో దొంగలు హుండీ చోరీకి పాల్పడడం కలకలం రేపుతోంది. అయితే హుండీని ఎత్తుకెళ్లిన దొంగలు.. అందులోని డబ్బులు తీసుకోలేక బైకును హుండీని వదిలేసి పారిపోయారు. ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. దీంతో ఈ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నా పోలీసులు.