మరోసారి ఉలిక్కిపడ్డ శ్రీశైలం భక్తులు

శ్రీశైలంలో మళ్లీ చిరుత కలకలం మొదలైంది. అదిగో చిరుత అంటున్నారు భక్తులు. దీంతో మళ్లీ భయం నెలకొంది. మరోసారి చిరుత సంచారాన్ని భక్తులు గుర్తించారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో మరోసారి చిరుతపులి కలకలం రేపింది. క్షేత్ర పరిధిలోని రెడ్ల సత్రం సమీపంలో చిరుతపులి భక్తులకు కనిపించింది. చిరుతపులిని చూసిన స్దానికులు భక్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.