కచ్చతీవు ద్వీపంపై రాజకీయాలు తారాస్థాయికి చేరాయి.. భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంక అప్పగించింది. దీనిపై తాజాగా తమిళనాడు బీజేపీ నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో మళ్లీ ఇది వార్తల్లోకి వచ్చింది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించడంతో రాజకీయాలు వేడెక్కాయి..