ఎన్నికల ప్రచారంలో జోష్ పెంచిన సీఎం రేవంత్..

ఎన్నికల ప్రచారంలో జోష్ పెంచిన సీఎం రేవంత్.. మొట్టమొదటి సారి ఆదివాసీ ఆడబిడ్డ ఆత్రం సుగుణకు కాంగ్రెస్ అవకాశం ఇచ్చిందని తెలిపారు. ఆత్రం సుగుణ టీచర్‎గా పిల్లల మీద ఎంత ప్రేమ ఉందో వాళ్ల భవిష్యత్ మీద ఎంత ఆలోచన ఉందో ఎంపిగా అవకాశం ఇస్తే అంతే ప్రేమతో నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తారని సీఎం రేవంత్ తెలిపారు. ఆనాడు ఇందిరమ్మ.. ఇంట్లో ఉండే పేద ఆదివాసీ బిడ్డకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే అసెంబ్లీలో కొట్లాడుతున్నడని.. ఆత్రం సుగుణకు పట్టం కడితే అంతే జోష్ తో మీ తరుపున పార్లమెంట్‎లో గళం వినిపిస్తారన్నారు. నాకు ఆదిలాబాద్ అంటే ప్రత్యేక అభిమానం అన్నారు.