బంగారం షాపులోకి చొరబడ్డ దుండగులు.. గన్‌తో బెదిరించి నగలతో పరార్‌!

ముసుగులు ధరించిన ముగ్గురు అగంతకులు నగల దుకాణంలోకి చొరబడ్డారు. తమ వెంట తెచ్చుకున్న గన్నులతో పలుమార్లు గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం నగల దుకాణంలోని సిబ్బందిని బెదిరించి సుమారు రూ.11 లక్షలకు పైగా విలువైన ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ షాకింగ్‌ ఘటన మహారాష్ట్రలో ఆదివారం (జులై 28) రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..