ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రేవంత్ రెడ్డి గతానికి భిన్నంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సీఎం కాన్వాయ్ వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ కు అంతరాయం కలుగొద్దని రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా వాహనాల సంఖ్యను కూడా దాదాపు సగానికి తగ్గించాలని సూచించారు.