ఆసుపత్రిలో కలకలం.. ఉన్నట్టుండి రోగులకు అస్వస్థత.. అసలు కారణం ఇదే..

అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి ఏరియా అస్పత్రిలో ఇంజక్షన్ వికటించింది. 23మంది ఇన్ పేషెంట్లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వణుకు, జ్వరం, వాంతులతో అవస్థలు పడ్డారు. దీంతో హుటాహుటిన వారందరినీ మెరుగైన వైద్య చికిత్స కోసం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు.