ఎందుకో ఎరుపెక్కిన సముద్రం..! భయం భయంగా స్థానికులు, పర్యాటకులు.. హుటాహుటిన రంగంలోకి అధికారులు..

ఇటీవల తమిళనాడు లోని పలు ప్రాంతాల్లో సముద్రంలో నీరు రంగులు మారుతూ కొత్త రూపంలో కనబడుతోంది.. ఆ మధ్య చెన్నైలోని మెరినా బీచ్ లో సముద్ర నీరు బులుగు రంగు కాకుండా పచ్చని రంగులో కనిపించింది. అలాగే కొద్దీ రోజుల తర్వాత సాయంత్రం సముద్ర తీరంలో నీటిలో రేడియం లైట్లు వెలిగిన దృశ్యాలు కనిపించాయి. ఇక సూర్యోదయం, సూర్యాస్తమయం రెండూ చూడగలిగే అరుదైన అవకాశం ఉన్న కన్యాకుమారిలో కూడా సముద్రంలో నీరు అసాధారణంగా కనబడింది. తాజాగా పుదుచ్చేరి సముద్ర తీరంలో నీరు రంగు ఎర్రగా మారింది.