శవంతో సాహస యాత్ర.. అల్పపీడన ప్రభావంతో చిగురుటాకుల చిత్తూరు జిల్లా..!

రుపతి జిల్లాలోని కస్తూరి నాయుడు కండ్రిగ గ్రామంలో చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించాలంటే అరుణా నది కాలువను దాటి స్మశానానికి వెళ్లాల్సి ఉంది. తుపాను ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి ఆ కాలువలో నీళ్లు పెద్ద ఎత్తున ప్రవహిస్తున్నాయి. గ్రామస్థులు శవాన్ని భుజాలపై మోసుకుని నడుము లోతు నీటిలో కాలువను దాటుకుని స్మశానాన్ని చేరుకుని అంత్యక్రియలు నిర్వహించారు.