పోలీసులు ఎన్ని దాడులు చేసినా...హైదరాబాద్లో పబ్బుల తీరు మారడం లేదు. ఎన్ని అరాచకాలు జరుగుతున్నా.. వాళ్లకు పైసలే ముఖ్యమా? అన్నట్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా నార్కోటిక్ బ్యూరో, ఎస్వోటీ పోలీసులు దాడులు చేయడంతో అస్సలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. పబ్బులో గంజాయి, కొకైన్, మెత్ విచ్చలవిడిగా వినియోగించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.