శ్రీశైలం ఆలయ పరిసరాల్లో చిరుతపులి కలకలం..!

శ్రీశైలం టోల్ గేట్ వద్ద అర్ధరాత్రి చిరుతపులి కలకలం సృష్టించింది. ఆహారం వెతుక్కుంటూ టోల్‌గేట్ పక్కనే ఉన్న అటవీ ప్రాంతం నుంచి చిరుతపులి జనారణ్యంలోకి వచ్చింది. టోల్‌గేట్ వద్ద పడుకుని ఉన్న కుక్కను మాటు వేసి వేటాడింది. గోడ చాటున నక్కిన చిరుతపులి గోడపై నుంచి ఒక్కసారిగా దూకి కుక్క మెడ పట్టుకుని లాక్కెళ్లింది. ఇది గమనించిన శ్రీశైలం వస్తున్న యాత్రికులు భయాందోళనలకు గురయ్యారు. కొందరు చిరుతపులి దాడికి సంబంధించిన వీడియోను చిత్రీకరించారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది చిరుతపులి సంచరించే ప్రదేశాలలో పరిశీలించారు. రాత్రుల సమయంలో స్దానికులు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు.