జలపాతంలో ఈత కొట్టేందుకు వెళ్లి.. నీటిలో కొట్టుకుపోయిన యువకుడు

సరదాగా ఈతకు వెళ్లిన ఓ వ్యక్తి జలపాతంలో దూకి అదృశ్యమయ్యాడు. వరుసగా కురుస్తున్న వర్షాల ధాటికి జలపాతం ఉధృతుకి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. మహారాష్ట్రలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకెళ్తే.. స్వప్నిల్ ధావ్డే అనే వ్యక్తి మహారాష్ట్రలోని ఓ జిమ్‌ను నిర్వహిస్తున్నాడు. జిమ్‌కి వచ్చే మరో 32 మంది వ్యక్తులతో కలిసి స్వప్నిల్‌ శనివారం (జూన్‌ 29) విహారయాత్ర కోసం తమ్హిని ఘాట్‌లోని ప్లస్ వ్యాలీ సందర్శనకు వెళ్లారు.