ఉత్తరాంధ్ర కల్పవల్లి అని ప్రసిద్ధి చెందిన పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ శ్రీ కోటదుర్గ అమ్మవారి ఆలయంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. కార్తీక మాస ద్వాదశి పర్వదినం, ఆదివారం ఉదయం.. సూర్యుని తొలి లేలేత కిరణాలు ఆలయం ముఖద్వారం, మండపాలు దాటి నేరుగా గర్భగుడిలోని అమ్మవారి మూలవిరాట్ను తాకాయి.