వలకు చిక్కిన వింత చేప.. లబోదిబోమంటున్న మత్స్యకారులు..!

ఇటీవల మత్స్యకారుల వలకు చిక్కుతున్న చేపలు భయ పెడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నిత్యం ఎక్కడో ఒక చోట వింత చేపలు వలకు చిక్కుతున్నాయి. అయితే వలకు పెద్ద చేపలు దొరికాయని సంతోషించేలోపే ఆ చేపల గురించి తెలిసి షాక్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాలో గిరిజనుడి వలకు చేపలు చిక్కాయి. కిలో బరువు వుండే ఈ చేప వింతగా, భయం కలిగించేదిగా ఉండటంతో షాక్ అయ్యారు. సముద్రంలో కనిపించే చేపలు ఇక్కడ దొరకడంతో వాటిని గ్రామస్తులు వింతగా చూస్తున్నారు