అనకాపల్లి జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం -TV9

అనకాపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న బాలికపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు ఓ ప్రేమోన్మాది. ఘటనా స్థలంలోనే బాలిక ప్రాణాలు కోల్పోయింది. హత్య చేసి నిండితుడు సురేష్ పారిపోయాడు. అనకాపల్లి రాంబిల్లి మండలం కొప్పు గుండు పాలెంలో ఘటన జరిగింది. గతంలో ఇదే బాలికను వేధింపుల కేసులో జైలుకు వెళ్లొచ్చాడని చెబుతున్నారు బంధువులు..