టెర్రస్ పై గంజాయి సాగు

ట్రాన్స్‌పోర్ట్ కష్టంగా మారింది. పోలీసులు రైళ్లలో కూడా తనిఖీలు చేస్తున్నారు. దీంతో వారి దందా సాగడం లేదు. అక్కడి నుంచి.. ఇక్కడి తేవడం రిస్క్ ఎందుకు అనుకున్నారు. టెర్రస్‌పైనే తమ ప్లాన్ అమలు చేశారు. చివరికి పోలీసులకు చిక్కారు. హైదరాబాద్ మలక్‌పేట్ మహబూబ్ మిషన్ మార్కెట్‌లోని ఒక భవనంలోని టెర్రస్‌లో గంజాయి మొక్కలు పెంచుతున్న ఇద్దరు వ్యక్తులను శుక్రవారం (డిసెంబర్ 5) హైదరాబాద్ నగర ఎన్‌ఫోర్స్‌మెంట్ టీం అదుపులోకి తీసుకున్నారు.