300 మందికి పైగా నిరుద్యోగులకు యువకుడి కుచ్చుటోపి

అన్నమయ్య జిల్లా పీలేరులో ఐటీ మోసగాడి వ్యవహారం వెలుగు చూసింది. ఐటి ఉద్యోగాల పేరుతో ఘరానా మోసానికి పాల్పడ్డ పీలేరు యువకుడు వందలాది మంది నిరుద్యోగులను బురిడీ కొట్టించాడు. ఢిల్లీ, హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని 300 మందికి పైగా నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టాడు. ఏపీ తెలంగాణకు సంబంధించిన యువతి యువకులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ మోసం బయట పడింది.