శ్రీశైలంలో దసరా మహోత్సవాలు ముగిసాయి. భ్రమరాంబికాదేవి నిజాలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చింది. నందివాహనంపై అమ్మవారు ఆలయ ప్రదక్షిణ చేశారు. దసరా పండగ సందర్భంగా జమ్మి వృక్షానికి శమి పూజని నిర్వహించారు. ఆలయ పుష్కరిణిలో శ్రీస్వామి అమ్మవార్లకు వైభవంగా తెప్పోత్సవం నిర్వహించారు. ఈ తెప్పోత్సవ కార్యక్రమంలో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గన్య, ఈవో శ్రీనివాసరావు దంపతులు పాల్గొన్నారు.