IIT Experts Visit Amaravati : ఐఐటీ నిపుణుల నివేదికలో ఏముంది..? - TV9

మధ్యలోనే ఆగిపోయిన కట్టడాల పటిష్టతను పరిశీలించేందుకు ఐఐటీ మద్రాస్‌ నిపుణుల బృందం అమరావతిలో పర్యటించింది. ఈ ప్రాంతంలో గత ఐదేళ్లుగా ఎండకు ఎండి, వానకు తడిసిన నిర్మాణాలను పరిశీలించింది. సెక్రటేరియట్‌, హెచ్‌వోడీ భవనాలు, హైకోర్టు నిర్మాణాల పటిష్ఠతపై ఈ బృందం అధ్యయనం చేయనుంది. ఐకానిక్‌ టవర్ల వద్ద రాఫ్ట్‌ ఫౌండేషన్‌ నిపుణులు పరిశీలించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందితో కలిసి నీటిలో మునిగిన నిర్మాణాల పరిశీలన చేపట్టారు. ఈ నిర్మాణాలను పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాత నిపుణుల బృందం సీఆర్డీఏకు నివేదిక ఇవ్వనుంది.