గోడ కూలి 9మంది చిన్నారులు మృతి.. రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన

మధ్యప్రదేశ్ రాష్ట్రం సాగర్‌ జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఓ దేవాలయం గోడ కూలడంతో.. శిథిలాల కింద చిక్కుకుని 9 మంది పిల్లలు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం ఉదయం ఈ ఘోర ఘటన చోటు చేసుకుంది. ఈ విషాద ఘటన సాగర్ జిల్లాలోని షాపూర్‌లోని హర్దౌల్ బాబా దేవాలయం సమీపంలో చోటుచేసుకుంది. రెస్క్యూ టీం గాయపడిన చిన్నారులను రక్షించి, ఆస్పత్రికి తరలించారు. ఆలయంలో మతపరమైన వేడుకల్లో భాగంగా చిన్నారులు శివలింగాలను తయారు చేస్తుండగా, ఆలయం పక్కనే ఉన్న ఇంటి గోడ ఒక్కసారిగా కూలిపోయింది. కూలిన ఇల్లు దాదాపు 50 ఏళ్ల నాటిదని, భారీ వర్షాల కారణంగా కూలిపోయిందని స్థానిక అధికారులు తెలిపారు.