ఇండియాలోనే రిచెస్ట్ గణనాథుడి నిమజ్జనం పూర్తి

ఇండియాలోనే రిచెస్ట్ గణనాథుడి నిమజ్జనం పూర్తి ఐదు రోజుల పాటు ఘనంగా పూజలందుకున్న ఇండియాలోనే అత్యంత సంపన్నుడైన ముంబైలోని GSB గణనాథుడి నిమజ్జనం పూర్తయింది. ఈ రిచెస్ట్ వినాయకుడి శోభాయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. అయితే, సముద్రంలో నిమజ్జనం చేసేవరకూ 66 కిలోల బంగారు ఆభరణాలను విగ్రహానికే ఉంచి, సముద్రం వద్దకు చేరాక వినాయకుడి బంగారు, వెండి ఆభరణాలను తొలగించి, నిమజ్జనం చేశారు.