కణకణలాడే నిప్పులో నడిచి మొక్కులు..!

నల్లగొండ జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం చెర్వుగట్టు శ్రీ పార్వతీసమేత జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అగ్ని గుండాల కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. కణకణలాడే నిప్పుల్లో నడిచి భక్తులు ముక్కులు తీర్చుకున్నారు. పంటలకు చీడపీడలు సోకకుండా బాగా పంటలు పండి సుభిక్షంగా ఉంటామని భక్తుల నమ్మకం. ఏడాది పొడవున స్వామి వారి ఆశీస్సులు తమకు ఉంటాయని భక్తుల విశ్వాసం.