Watch Video: తిరుమలలోని వీఐపీ కాటేజీలో అనుకోని అతిథి.. పరుగులు తీసిన జనం..

తిరుమలలో భక్తులకు పాముల భయం వెంటాడుతోంది. శేషాచలం అటవీ ప్రాంతంలోని విష సర్పాలు తరచూ కనిపిస్తుండడంతో భక్తుల్లో వణుకు పుడుతోంది. ఈ మధ్యకాలంలో తరచూ కనిపిస్తున్న పాములను చూసి భక్తులు పరుగులు పెడుతున్న పరిస్థితి నెలకొంది. నడక మార్గాల్లోనే కాకుండా భక్తులు సేద తీరే చోట్ల, వీఐపీలు బస చేసే కాటేజీలు, స్థానికులు నివాసం ఉండే ప్రాంతాల్లో పాములు కనిపిస్తున్నాయి. ఏకంగా 8 నుంచి 10 అడుగుల కొండచిలువలు నుంచి పరిగెత్తి బుసలు కొట్టే విష నాగులు దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలోనే.. తిరుమల విఐపి కాటేజీలో ఓ నాగుపాము కనిపించింది.