డాలస్‌లో తెలుగు విద్యార్థి దారుణ హత్య

డల్లాస్‌‌లో దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలుగు విద్యార్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాకు చెందిన దాసరి గోపీకృష్ణ (32)గా గుర్తించారు. కర్లపాలెం మండలం యాజలికి చెందిన గోపీకృష్ణ జీవనోపాధి కోసం 8 నెలల క్రితం అమెరికా వెళ్లాడు. ఎమ్మెస్ పూర్తి చేసిన గోపీకృష్ణ, మంచి ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతం ఆర్కెన్సాస్‌లోని ఓ సూపర్‌ మార్కెట్‌లో పనిచేస్తున్నాడు.