షాద్ నగర్ ఘటనపై సీఎం రేవంత్ సీరియస్ Cm Revanth Reddy Serious On Shad Nagar Incident - Tv9

చోరీ కేసులో మహిళను చితక్కొట్టిన పోలీసులపై సీరియస్‌ అయిన సీఎం రేవంత్‌ రెడ్డి.. షాద్‌నగర్‌ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు.. వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ అంశాన్ని సైబరాబాద్ సీపీ అవినాష్‌ మహంతి కూడా సీరియస్‌గానే తీసుకున్నారు. షాద్‌నగర్ ఏసీపీ రంగస్వామితో సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. సీఎం ఆదేశాలతో ఇన్‌స్పెక్టర్‌ రామ్‌రెడ్డిని వెంటనే హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేశారు.