మల్లన్న ఆలయానికి బంగారు నాగాభరణం విరాళం.. నేటి నుంచి ఐదు రోజులు స్పర్శ దర్శనం నిలిపివేత

ఒడిస్సా రాష్ట్రం రాయఘడ్ జిల్లా గుణుపూరుకు చెందిన గోపాలరావు అనే భక్తుడు దేవస్థానానికి ఎర్రరాళ్ళు పొదిగిన బంగారు నాగాభరణాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ నాగాభరణం 45 గ్రాములు ఉంది. మరోవైపు నేటి నుండి ఈనెల 19 వరకు 5 రోజులపాటు శ్రీశైలంలో శ్రీస్వామివారి స్పర్శ దర్శనం నిలుపుదల జేశారు. భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిని ఇస్తున్నారు.  శ్రావణమాసం వరుస సెలవులు రావడంతో మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది.