కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం. ఆదివాసీల ఆరాధ్య దైవం గుంజేడు ముసలమ్మ జాతర మహా వైనవంగా జరుగుతుంది. కనీసం రోడ్డు మార్గంలేని ఆ ఆలయం వద్దకు భక్తి మార్గమే భక్తులకు నడిపిస్తుంది. ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం అమ్మవారి ప్రతిరూపాన్ని వనం నుండి జనం మధ్యకు తీసుకొచ్చారు. సాధారణ భక్తులతో పాటు మంత్రి సీతక్క కూడా ముసలమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు.