కిలోమీటర్ దూరం వరకు మృతదేహాన్ని ఈడ్చుకెళ్లిన బస్సు..!

చిత్తూరు జిల్లాలో అమానుష ఘటన వెలుగు చూసింది. చిన్న పాటి గొడవతో బస్సుతో ఢీకొట్టి చంపేశాడు మరో బస్సు డ్రైవర్ ఈ దారుణం బంగారుపాళ్యం మండలం మహసముద్రం టోల్‌గేట్ వద్ద చోటుచేసుకుంది. తోటి డ్రైవర్‌ అన్న కనికరం లేకుండా బస్సుతో తొక్కించి హతమార్చాడు మరో బస్సు డ్రైవర్..! సుమారు కిలోమీటర్ దూరం వరకు మృతదేహన్ని లాక్కెళ్లాడు. దీంతో డెడ్ బాడీ చిద్రమైంది.